Sunday, May 19, 2024

జన్మాంతం సిరిసిల్ల ప్రజలతోనే ఉంటా..!

spot_img

బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్ళను. రాజకీయ జన్మను ఇచ్చిన సిరిసిల్ల ప్రజలతోనే ఉంటాను. 24 సంవత్సరాలు పని చేసిన కారుకు, చిన్న సర్వీసింగ్ అవసరం పడదా ? ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాం.

రైతులు రైతు బందు కోసం ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రొడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఫ్రీ బస్సుల కోసం మహిళలు పడుతున్న అవస్థలు చూస్తూనే ఉన్నాం. బస్సులు పెంచండి, రోడ్డున పడుతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు హామీలు ఇచ్చారు. మాకు తెలంగాణ ముఖ్యం కాబట్టి, తప్పకుండా ప్రజల పక్షాన ముందుంటాం. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడంలో కెసిఆర్ ను మించిన నాయకుడు దేశంలో లేడు అని అన్నాడు కేటీఆర్.

Latest News

More Articles