Sunday, May 19, 2024

విద్యార్థులు ప్ర‌భుత్వం అందించే వ‌స‌తుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

spot_img

బాలానగర్ మండలం హైదర్ నగర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను కూక‌ట్‌ప‌ల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇవాళ(గురువారం) సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల పాఠశాల ఉచిత విద్య సందర్భంగా 5, 6 7, 8 తరగతి లకు ప్రవేశాలు జరుగుతున్నాయని… ఇందులో భాగంగా మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

గురుకుల పాఠశాల నిర్మాణం కొరకు దూలపల్లి లో మరొక రెండున్నర ఎకరాలు కేటాయించామని తెలిపారు మాధవరం కృష్ణారావు. ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలను అందించారు. ఆ తర్వాత  విద్యార్థులకు నోటుబుక్స్, యూనిఫామ్, బూట్లు, దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసోద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జితేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మైనంపల్లి హనుమంత రావుపై చర్యలు తీసుకోండి: లోకాయుక్త

Latest News

More Articles