హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం కాగానే క్రీజులోకి ఓ యువకుడు ఒక్కసారిగా దూసుకొచ్చాడు. బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ కాళ్ళు మొక్కాడు. వెంటనే భద్రతా సిబ్బంది అలెర్ట్ అయి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
Also Read.. ఓటుకు నోటు దోంగ సీఎం అయితే ఇలానే ఉంటుంది.. మండిపడుతున్న విద్యార్థులు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 3, అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్ల చోప్పున పడగొట్టారు.