అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం 3రోజుల క్రితం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా సెలబ్రెటీలు అందరు పాల్గొనగా.. సౌత్ నుండి మెగా ఫ్యామిలీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అయితే టాలీవుడ్ నుండి చిరంజీవి ఫ్యామిలి మాత్రమే హాజరవ్వటం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే ప్రభాస్, మోహన్బాబు, ఎన్టీఆర్ లకు ఆహ్వానం అందినా వెళ్లలేదనే ప్రచారం జరిగింది.
ప్రభాస్కి అనారోగ్య కారణంతో అయోధ్యకి రాలేకపోయాడని తెలుస్తుంది. కాలుకి జరిగిన స్వల్ప గాయంతో నడవలేని స్థితిలోనే ప్రభాస్ వేడుకలకి వెళ్లలేదని ఇండస్ట్రీ వర్గాలు తెలిపుతున్నాయి. ఇక సెక్యూరిటీ కారణాలతో.. తనకి ఆహ్వానం అందినా వెళ్లలేకపోయానని మోహన్ బాబు స్వయంగా తెలియజేశాడు. ఆ క్రౌడ్లో వెళ్లడం తనకు ఇష్టం లేదని అందుకే సెక్యూరిటీ ఇస్తామన్నా వెళ్లలేదని తెలిపారు. అయితే పంచ్ ఏంటంటే అసలు మోహన్బాబకి అయోధ్య ఆహ్వానమే అందలేదని తెలుస్తుంది.సీఎం స్థాయి వ్యక్తులకే ఆహ్వానం లేదు, మోహన్బాబుకి ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఎన్టీఆర్కి ఆహ్వానం అందిందనే ప్రచారం జరిగింది, ఆయన ఎందుకువెళ్లలేదనే ఆరా తీయడం స్టార్ట్ అయ్యింది. కానీ తారక్ కూడా ఆహ్వానం అందలేదని సమాచారం. గతంలో బీజీపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి డైరెక్ట్ గా ఎన్టీఆర్తో భేటీ అయ్యాడు. దీంతో బీజేపీకి తారక్ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం ప్రారంభమైంది. ఆయనకు ఆహ్వానం ఉంటుందని తెలిసింది. కానీ ఆయనకు కూడా ఆహ్వానం లేదని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.