హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రాణించడంతో స్టోక్స్ సేన మొదటి రోజే మూడో సెషన్లో కుప్పకూలింది. టీమిండియా స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రాణించడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు.
Also Read.. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ లో రోహన్ బొపన్న-ఎబ్డెన్ జోడి
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) హాఫ్ సెంచరీతో రాణించారు. ఇంగ్లాండ్ మిగతా బ్యాటర్లలో జానీ బెయిర్స్టో(37), బెన్ డకెట్(35), జో రూట్(29), జాక్ క్రాలే(18)లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 3, అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్ల చోప్పున పడగొట్టారు.
Innings Break!
A solid bowling display from #TeamIndia! 💪 💪
England all out for 246.
3⃣ wickets each for @ashwinravi99 & @imjadeja
2⃣ wickets each for @Jaspritbumrah93 & @akshar2026Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/2YnS3ZxSI2
— BCCI (@BCCI) January 25, 2024