Saturday, May 18, 2024

రోజులో 24 గంటలుంటే.. 25 గంటల కరెంటు ఎలా..?

spot_img

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌కు గుడికి, బడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(శుక్రవారం) ఆమె పాపన్నపేట మండలం ఎల్లాపూర్, యుసుపేట గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మైనంపల్లి రోహిత్‌కు మెదక్ నియోజకవర్గ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. రోజుకు 24 గంటలే ఉంటుందని, కానీ రోహిత్ మాత్రం 25 గంటలు విద్యుత్ ఇస్తానని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. రోజుకు ఎన్ని గంటలు ఉంటాయో కూడా ఆయనకు తెలియదన్నారు. ఇరవై నాలుగు గంటల విద్యుత్ మేమే ఇస్తుంటే ఇక మీరు ఇవ్వడం ఏమిటన్నారు. ఏం తెలియకుండానే మెదక్‌కు వచ్చి ఏదో చేస్తానని చెబుతున్నాడని, అసలు ఇక్కడ ఏవి ఎన్ని ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.

ఇది కూడా చదవండి: ఎవడికో ఓటు వేసి అభివృద్ధిని నాశనం చేసుకోవద్దు

Latest News

More Articles