Friday, May 17, 2024

దేశమే ఆశ్చర్య పోయేలా వైద్యాలయాలు

spot_img

జనగామ చెంపక్ హిల్స్ లో నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ అనంతరం కాలేజీ ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఒక పండుగ రోజు, దేశమే ఆశ్చర్య పోయే విధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చి వైద్య, విద్య రంగాలకు పెద్ద పీట వేసిన ఘనత మన సీఎం కెసిఆర్ ది.

25% సీట్లు తెలంగాణ బిడ్డలకే వచ్చే విదంగా చేసారు, సీఎం కెసిఆర్ ఏది చేసినా ఒక చరిత్రనే. తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం, వైద్య విద్యలో 3వ స్థానం, వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంది. జనగామ జిల్లా వ్యాప్తంగా కరువు ఉండేది కానీ ఇప్పుడు అధిక ధాన్యం పండుస్తున్న జిల్లా జనగామ జిల్లా. 3 పంటలు వేసుకునే విదంగా సాగు నీరు వచ్చింది, దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే, అదే స్థాయిలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారికి జనగామ పై ప్రత్యేక అభిమానం ఉంది’ అని చెప్పారు కడియం శ్రీహరి.

Latest News

More Articles