Monday, May 20, 2024

నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

spot_img

నెలసరి సెలవుల విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదమయ్యాయి. తాజాగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాను నిరుత్సాహపడ్డానని, ఇలాంటి అజ్ఞానాన్ని చూడటం దారుణమని అన్నారు. రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం మహిళల నిజమైన బాధను విస్మరించడమేనని అన్నారు. రుతుస్రావం ఒక ఎంపిక కాదని చెప్పారు.

ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో రుతుస్రావ పోరాటాలను తోసిపుచ్చడం బాధాకరం. ఒక మహిళగా, అజ్ఞానాన్ని చూడటం భయంకరంగా ఉంది, ఎందుకంటే మన పోరాటాలు, మా ప్రయాణాలు ఓదార్పు కాదు, ఇది ఒక సమానమైన ఆటకు అర్హమైనది, అది రాజీపడలేనిది.’’ అని పేర్కొన్నారు.

‘‘రుతుస్రావం అనేది ఒక ఎంపిక కాదు. అది బయోలాజికల్ రియాలిటీ. వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం అసంఖ్యాక మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరిస్తుంది. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల పట్ల సహానుభూతి లేకపోవడం, ప్రతిదానికీ మనం చేయాల్సిన పోరాటాన్ని చూడటం బాధాకరం. విధాన రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని సహానుభూతి, హేతుబద్ధతతో పూడ్చాల్సిన సమయం ఆసన్నమైంది.’’ అని ఆమె ట్వీట్ చేశారు.

Latest News

More Articles