Sunday, May 19, 2024

తొడగొడితేనో.. మెడ కోసుకుంటేనో కేసీఆర్‎పై గెలువరు

spot_img

రాష్ట్రంలో పింక్ వేవ్ నడుస్తోంది.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా దక్షిణ భారతదేశంలో రికార్డ్ సృష్టించడం ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ తరఫున ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేసీఆర్ అంటే ఒక ఆత్మీయత. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అహంకారం. తెలంగాణకు ఏమీ చేయని, ఎందుకు పనికిరాని వారు కేసీఆర్ పై మాట్లాడడం విడ్డూరం. తొడగొడితే, మెడ కోసుకుంటే కేసీఆర్ పై గెలువరు. కేసీఆర్‎ని గెలవాలంటే నాలుగు కోట్ల మంది గుండెల్లో స్థానం సంపాదించాలి. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ అహంకారంగా మాట్లాడుతుంది. రైతుబంధు, ఉచిత కరెంటు వృధా ఖర్చు అంటోంది. అలాంటి వారికి అధికారం ఇస్తే చాలా నష్టపోతాం. పండగ అయినా, పబ్బమైన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి బోధన్ ఎమ్మెల్యే షకీల్. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి బోధన్‎కు చేసింది ఏమీ లేదు. ప్రజలు ఆలోచించి మరోసారి షకీల్‎ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కవిత కోరారు.

Read Also: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‎లో బాంబులు పేలుతాయి! ముంబై పోలీసులకు బెదిరింపు

Latest News

More Articles