Saturday, May 4, 2024

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‎లో బాంబులు పేలుతాయి! ముంబై పోలీసులకు బెదిరింపు

spot_img

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‍ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సెమీస్‍లో గెలిచి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.

Read Also: ఖమ్మానికి పువ్వులు కావాలా? తుమ్మ ముల్లులు కావాలా?

కాగా.. మ్యాచ్ కాసేపట్లో మొదలవ్వాల్సిన తరుణంలో.. స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపింది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగే సయమంలో వాంఖడే స్టేడియంలో బాంబులు పేలుతాయని ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్విట్టర్‎లో ముంబై పోలీసులకు బెదిరింపులు చేశాడు. తన పోస్ట్‌లో ముంబై పోలీసులను ట్యాగ్‌ చేసిన ఆ వ్యక్తి.. తుపాకీ, హ్యాండ్‌గ్రనేడ్‌, బుల్లెట్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. దాంతో ముంబై పోలీసులు అప్రమత్తమయి.. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.

Read Also: ఎన్నికల ప్రచారంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

కాగా.. వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడి చేస్తామంటూ అప్పుడు ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆపై నిందితుడిని అరెస్టు చేశారు.

Latest News

More Articles