Friday, May 17, 2024

బీసీల కోసం భారత్ జాగృతి పోరాటం చేస్తూనే ఉంటుంది

spot_img

బీసీల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాసాబ్ ట్యాంక్‎లోని ఖాజా మాన్షన్‎లో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది. పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశాం. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బీసీల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతుంది. ఏప్రిల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశం ఎటు వైపు వెళ్తుందన్న దానిపై చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. భారత జాగృతి ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం పోరాటం చేసి సాధించాం. బడుగుల కోసం పనిచేసిన ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్‎కు వినతి పత్రం అందించాం. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్ధతు కూడగట్టడానికి లేఖ అందించాం.

Read Also: పాటకు స్టెప్పులేస్తూ భారత్‌కు రష్యా స్పెషల్‌ విషెస్‌

బీసీల అభ్యున్నతి కోసం భారత్ జాగృతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. బీసీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తాం. మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అనేక సంఘసంస్కర్తల జయంతులను తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కాయి. గత పదేళ్లలో బీసీల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసింది. ఆ పరంపర కొనసాగింపుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తాం. తొలి అడుగుగా విగ్రహ సాధన కార్యక్రమాన్ని తీసుకున్నాం’ అని కవిత అన్నారు.

Latest News

More Articles