Sunday, May 19, 2024

ఇచ్చిన మాటను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్

spot_img

ఇచ్చిన మాటను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.గోసంగి కులస్తులకు.. దళితులకు వచ్చే అన్ని పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ పెన్షన్ పథకం లేదు..కేవలం తెలంగాణ లోనే అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇంటి దీపం అయ్యారు. మోడీ హయాంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాలు పని చేయాలి.మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వం బీఅర్ఎస్ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో 3డయాలిసిస్ సెంటర్లు ఉంటే ఈ రోజు 104 డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం.

ఆడ బిడ్డలపై ఒక ఆత్మీయత అనురాగంతో సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు ఎన్నో రాష్ట్రం లో అమలు అవుతున్నాయన్నాయని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.ఇచ్చిన మాటను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. మానవీయ కోణం ఉన్న సీఎం ఉంటేనే మన రాష్ట్రంలో అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం పాటు పడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ నీ చూసి రేవంత్ రెడ్డి, ఈటల రెండు చోట్ల పోటీ చేస్తారట.. వీరికి ప్రజల నుండి వాతలు తప్పవన్నారు ఎమ్మెల్సీ కవిత. గాందీభవన్ లో రేవంత్ అనే  గాడ్సే దూరిండు అందుకే బీసీ లకు అన్యాయం జరుగుతుందన్నారు. అధికారంలోకి రాక ముందే రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

మూడవ సారి కేసీఆర్  ముఖ్యమంత్రి అయి దక్షణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి:రాత్రి 8 నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి

Latest News

More Articles