Sunday, May 19, 2024

కుల వృత్తులను ఆదుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్

spot_img

తెలంగాణ రాక ముందు గంగ పుత్రుల బతుకులు దయనీయంగా ఉండేదన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ కృషి చేసి 268 జీఓ తీసుకు వచ్చి గంగ పుత్రుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో గుండ్ల సోదరుల గురించి మొట్ట మొదటి సారిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్. 2వేల గంగపుత్ర సంఘాలను 6వేల పెంచుకున్నాము. స్కి ల్ టెస్ట్ ద్వారా సహకారం అందిస్తున్నాం. ప్రతి మండలంలో ఒక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు గంగ పుత్రులను ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. కులవృత్తుల ను ఆదుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. కేసీఆర్ బీమా నిరు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతది.కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. గ్యాస్ ధర రెట్టింపు అయింది.మూడో సారి బీఅర్ఎస్ పార్టీ అధికారం లోకి వస్తే రూ. 400 కే గ్యాస్ సిలెండర్ అందిస్తామని..ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసిన సీఎం కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: కర్ఫ్యూ లేని తెలంగాణ చూస్తున్నాం

Latest News

More Articles