Friday, May 3, 2024

బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

spot_img

భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఇవాళ (మంగళవారం) భారత్ జాగృతి సమితి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. గత కొన్నేండ్లుగా భారత జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ  పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఈనెల 21న నిర్వహించబోయే వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ వారితో పాటు, ప్రవాస భారతీయులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

బతుకమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉన్నటువంటి భారత్ జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండగలకు వివిధ దేశాల్లో ప్రాచుర్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత్ జాగృతి యూకే విభాగాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

Latest News

More Articles