హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రేవంత్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేశారు.
Also Read.. కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే.. ఒప్పించే బాధ్యత నాది
రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో హైకోర్టు కొట్టేయడంతో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.