నిజామాబాద్: తెలంగాణలో మోడీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పసుపు బోర్డుపై మాట ఇచ్చి తప్పారని, ఇప్పుడు మళ్లీ నిజామాబాద్ కు వచ్చి ఏం ఉద్ధరిస్తారని విమర్శించారు. పసుపు రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
Also Read.. కామారెడ్డిలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ ప్రభంజనం
మోడీ, రాహుల్ అధికారం కోసమే తెలంగాణపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్. ఎవరు ఎన్ని పర్యటనలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.