హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ఎంఐఎం అభ్యర్థులు లేని చోట సీఎం కేసీఆర్కు సపోర్టు ఇవ్వాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ కార్యకర్తల్ని, ప్రజలను కోరారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ఆయన సవాల్ విసిరారు.
Also Read.. త్వరలోనే మరో 40 వేల ఇండ్లు పంపిణీ
బీఎస్పీ ఎంపీ దనిష్ అలీపై లోక్సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓవైసీ స్పందించారు. పార్లమెంట్ వేదికగా ఓ బీజేపీ ఎంపీ.. ముస్లిం ఎంపీని దూషించిన తీరు ప్రజలంతా చూశారని ఆయన గుర్తు చేశారు. హర్యానాలో జునైద్, నసీర్ హత్యల గురించి ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.