మంకీఫీవర్ కలకలం రేపుతోంది. దీనిబారిన పడి కర్నాకటలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హోసనగర తాలూకాకు చెందిన 18ఏళ్ల యువతి, ఉడిపి జిల్లా మణిపాల్ కు చెందిన 79ఏళ్ల వ్రుద్ధుడు చికిత్స పొందుతూ మరణించారు. ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12 , చిక్కమగళూరులో మూడు కేసులు నమోదు అయినట్లు కర్నాటక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్ దీప్ వెల్లడించారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 2,288నమూనాలను సేకరించారు. అందులో 48మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: విషాదం.. బైకును ఢీకొన్న బస్సు.. దంపతులు మృతి