Sunday, May 19, 2024

మంకీ ఫీవర్ కలకలం..కర్నాటకలో ఇద్దరు మృతి..!!

spot_img

మంకీఫీవర్ కలకలం రేపుతోంది. దీనిబారిన పడి కర్నాకటలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హోసనగర తాలూకాకు చెందిన 18ఏళ్ల యువతి, ఉడిపి జిల్లా మణిపాల్ కు చెందిన 79ఏళ్ల వ్రుద్ధుడు చికిత్స పొందుతూ మరణించారు. ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12 , చిక్కమగళూరులో మూడు కేసులు నమోదు అయినట్లు కర్నాటక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్ దీప్ వెల్లడించారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 2,288నమూనాలను సేకరించారు. అందులో 48మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: విషాదం.. బైకును ఢీకొన్న బస్సు.. దంపతులు మృతి

Latest News

More Articles