హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొన్న దుర్ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పాతబస్తీ బహదూర్పురాలో చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతులను కింగ్స్ కాలనీకి చెందిన అహ్మద్ మొహినుద్దీన్, బుష్రా ఫాతిమా లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.