Monday, May 6, 2024

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన మహ్మదాబాద్ ఎస్సై

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్స్ చేసింది. మహ్మదాబాద్ ఎస్సై సురేష్ లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పగిడ్యాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి నుండి మహ్మదాబాద్ ఎస్సై సురేష్ 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేసాడు. ఇప్పటికే 30 వేల రూపాయలను అందజేశాడు. మిగతా 20 వేల రూపాయలను కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జిరాక్స్ సెంటర్ కు చెందిన మూసా అనే వ్యక్తికి 20 వేల రూపాయలను అందజేసాడు. మహ్మదాబాద్ ఎస్సై సురేష్ తోపాటు రైటర్ ఇస్మాయిల్, జిరాక్స్ షాపు నిర్వాహకుడు మూసాలను సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.

Also Read.. ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ హెల్త్‌ డైరెక్టర్‌..!

Latest News

More Articles