Saturday, May 18, 2024

పండుగకు కొత్త బట్టలు కొనలేదని.. కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

spot_img

పండుగొచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు కొనడం అందరికీ అలవాటైంది. అయితే సంక్రాంతి పండుగకు భర్త కొత్త బట్టలు కొనలేదనే కోపంతో భార్య తన ఇద్దరు కూతుళ్లను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగింది.

Read Also: మంచులో కూరుకుపోయిన అమెరికా.. వేల విమానాలు ర‌ద్దు

నల్లమల మండలం రాంపూర్‌ పెంట గ్రామానికి చెందిన చిన బయానా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతనికి మొత్తం ఎనిమిది మంది సంతానం. బయానా కృష్ణా నదికి సమీపంలోని బేస్ క్యాంపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్యలలో ఒకరైన చిన్నగమ్మ తన కూతుళ్లు యాదమ్మ, బయ్యమ్మలకు సంక్రాంతి పండుగకు బట్టలు కొనాలని పట్టుబట్టింది. తనకు ఐదు నెలలుగా జీతం రాలేదని చిన బయానా తన పరిస్థితి గురించి చెప్పినా వినలేదు. దాంతో బట్టలు తెస్తానని చెప్పి పనికి వెళ్లాడు.

భర్త మాటలతో మనస్థాపం చెందిన చిన్నగమ్మ తన కుమార్తెలు యాదమ్మ, బయ్యమ్మలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పనికి వెళ్లిన బయానా కొత్త బట్టలు కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి.. ఇంట్లో భార్యాపిల్లల మృతదేహాలు కనిపించాయి. వారందరి మృతదేహాలు చూసి బయానా చలించిపోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ దృశ్యాన్ని చూసినవారంతా కన్నీటి పర్వంతం అయ్యారు.

Latest News

More Articles