Saturday, May 18, 2024

గుండెపోటుతో సోఫాలోనే చనిపోయిన తల్లి.. 5 రోజులుగా అలాగే ఉంటున్న కొడుకు

spot_img

గుండెపోటుతో ఓ తల్లి సోఫాలోనే చనిపోగా.. ఆమె కొడుకు 5 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది. పెదవాల్తేరు, కుప్పం టవర్స్‌లో శ్యామల అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. శ్యామల కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. అయితే ఐదు రోజుల క్రితం శ్యామల సోఫాలో కూర్చుని ఉండగా.. గుండెపోటు వచ్చింది. దాంతో ఆమె సోఫాలోనే కన్నుమూసింది. ఇది గుర్తించని కుమారుడు.. ఐదు రోజులుగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉంటున్నాడు. వారికి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. చుట్టుపక్కల వారు తలుపులు తట్టగా ఎవరూ తీయలేదు. దాంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. కుళ్లిన స్థితిలో శ్యామల మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికొచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్థానికి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని చంపిన కొడుకు

Latest News

More Articles