Sunday, May 5, 2024

రూ. 15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్.. వరుడి బెదిరింపు

spot_img

పెళ్లికి ముందు కట్నకానుకలు వద్దన్న వరుడు.. పెళ్లయ్యాక మాత్రం రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పడంతో అమ్మాయి తరపు బంధువులు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించి బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read Also: గుండెపోటుతో సోఫాలోనే చనిపోయిన తల్లి.. 5 రోజులుగా అలాగే ఉంటున్న కొడుకు

ఇంజినీర్ అయిన అవినాశ్‌ వర్మతో 2022 జూన్ 6న యువతి(27)కి వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానులు ఇతర లాంఛనాలు వద్దని చెప్పడంతో అల్లుడు ఎంత మంచివాడో అని అమ్మాయి తరపు బంధువులు మురిసిపోయారు. అయితే, వివాహం తర్వాత అవినాశ్‌వర్మలోని అసలు మనిషి బయటకు వచ్చాడు.

కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేని అమ్మాయి తల్లిదండ్రులు రూ.5.8 లక్షలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందని అవినాశ్ తాను అడిగిన రూ.15 లక్షల్లో మిగతా సొమ్ము ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పాడు. ఇవ్వకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు రోజురోజుకు మరింత పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles