Saturday, May 18, 2024

గొల్ల కురుమలను రేవంత్ కించపరిచారు.. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఫైర్

spot_img

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ బడుగుల మాట్లాడుతూ.. ‘గొల్ల కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమానపరిచారు. మేము మా భాధను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా జాతులు నీతి నిజాయతీగా బతుకుతాయి. అందరి తలలో నాలుకలా ఉండే జాతులు మావి. రేవంత్ రెడ్డి గతంలో కూడా కుల దూరహంకారంతో మాట్లాడారు. తమకే పాలన తెలుసు అన్నట్టుగా రేవంత్ రెడ్డి తన కులం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినప్పుడు కూడా నిరసనలు వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి తన నీచ రాజకీయాల గురించి కులాలను కించపరచడం తగదు. రేవంత్ లాగా శ్రీనివాస్ యాదవ్ కు నేర చరిత్ర ఉందా. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి. జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమా. రేవంత్ రెడ్డి గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. రేవంత్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఆయన్ను ఓడిస్తారు. రేవంత్ తన కులాహంకారానికి మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ఫైర్ అయ్యారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.

Latest News

More Articles