Saturday, May 4, 2024

రేవంత్ రెడ్డికి అగ్ర కుల అహంకారం పెరిగింది.. వెంటనే క్షమాపణలు చెప్పాలి..!

spot_img

కుర్మ, యాదవుల కుల వృత్తిని కించ పరుస్తూ యాదవ సామాజిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షులు రేంవత్ రెడ్డి వెంటనే యావత్ యాదవ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని యాదవ, కుర్మల జె.ఏ.సి డిమాండ్ చేసింది. నిన్న తలసాని కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించిన రేవంత్ పై తాజాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు యాదవ కులసంఘాలు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘాల నాయకులు లోడంగి గోవర్ధన్ యాదవ్ , మేకల రాములు యాదవ్, గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ యాదవ జేఎసి నాయకుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. ‘ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి అగ్రకుల అహంకారంతో యాదవులను, యాదవుల వృత్తిని అవమానపరుస్తూ దున్నపోతులు కాసే జాతి, పెండ పిసికే జాతి అని అనడాన్నియాదవ జేఏసీ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వారు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు కావడం దురదృష్టకరం.

రాష్ట్ర వ్యాప్తంగా యదవులందరు కలిసి ప్రతి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతాం. 24వ తేదీ అర్ధరాత్రి వరకు యాదవ జాతికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేకుంటే 25 తేదీన వేలాది మంది యాదవ, కుర్మల అందరితో కలిసి గాంధీ భవన్ ను పెద్ద ఎత్తున ముట్టడి చేపడుతాం. దాని తర్వాత ఏం జరిగినా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలోను తన అహంకారాన్ని చూపిస్తున్నారు. నేను ఒక్కడేనే పాలిస్తున్నట్టు తన ములాన్ని మర్చిపోతున్నాడు’ అంటూ సీరియస్ అయ్యారు రాజారాం యాదవ్.

Latest News

More Articles