Friday, May 17, 2024

నర్సాపురం ఎంపీ టికెట్ పై క్లారిటీ. .సంబరాల్లో డార్లింగ్ ఫ్యాన్స్

spot_img

దివంగత నటుడు, ప్రభాస్ పెదనాన్న మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనే శ్యామలాదేవి ఎంట్రీ ఇవ్వనుందట. వైఎస్సార్‌సీపీ తరపున నర్సాపురం నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే ఈ విషయంపై మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ పుకార్లపై శ్యామలా దేవి తన వైఖరిని స్పష్టం చేశారు.

ఈ నెల 20న కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, శ్యామలాదేవి స్వయంగా ఏర్పాట్లను చూస్తున్నారు. ఇక తమ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చే అంశం ప్రజలే నిర్ణయిస్తారని శ్యామల చెప్పుకొచ్చారు. ప్రజాభీష్ఠం మేరకే రాజకీయ నిర్ణయం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసారు. కృష్ణంరాజు ఉన్న సమయంలో ఏ విధంగా ప్రజాసేవ చేసారో అదే బాటలో తాము ప్రజా సేవ కొనసాగిస్తామని స్పష్టం చేసారు. ఇక ప్రభాస్ కూడా ప్రజాసేవ చేస్తారని అన్నారు శ్యామలాదేవి. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ విషయాన్ని ఆమె ఖండించకపోటంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Latest News

More Articles