Saturday, May 18, 2024

కాంగ్రెస్ కి షాక్.. నాగం రాంరాం..!

spot_img

కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నాగంకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కేటాయించలేదు. దీనిపట్ల నాగం గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, జానా రెడ్డి లాంటి నేతల దృష్టికి తీసుకెళ్లిన టికెట్ పై హామీ దక్కలేదు. కాగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి ఆకస్మికంగా కాంగ్రెస్ టికెట్ కేటాయించారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాగం ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో, అనుచరులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు నాగం స్పష్టత ఇచ్చారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో నాగం చేరుతారని తెలుస్తోంది

Latest News

More Articles