Monday, May 13, 2024

కొత్త కారుతో బీభత్సం సృషించిన యువతి.. ఒకరు మృతి

spot_img

కొత్త కారు కొన్న ఆనందంలో ఓ యువతి భీభత్సం సృషించింది. రోడ్డు మీద వెళ్తున్న బైకులను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాజిగూడలో బుధవారం రాత్రి జరిగింది. సాఫ్ట్‎వేర్ ఇంజనీర్‎గా పనిచేస్తున్న శివాని(26).. కొత్త కియా కారు కొనుగోలు చేసింది. తన స్నేహితులతో కలిసి వెళ్తూ.. డైరీ ఫామ్ రోడ్డులో అతివేగంగా నడిపింది. ఓ మలుపు రాగానే బ్రేక్ వేయాల్సింది పోయి.. యాక్సిలేటర్ తొక్కడంతో వేగంగా వెళ్లి స్విగ్గి డెలివరీ బాయ్ బైకును ఢీకొట్టింది. అనంతరం ముందుకెళ్లి మరో రెండు బైకులను ఢీకొట్టి, కరెంట్ పోల్‎ను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద ధాటికి కరెంట్ పోల్ సైతం విరిగిపోయింది. స్విగ్గి డెలివరీ బాయ్‎ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాద సమయంలో ‌కారులో ముగ్గురు ఉన్నారని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం వారందరూ కారు వదిలి పారిపోయారు. అయితే కారు టీఆర్ నెంబర్ ఆధారంగా పోలీసులు.. నిందిరాలు శివానిగా గుర్తించారు. శివానిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Latest News

More Articles