చెన్నై: వన్డే ప్రపంచకప్లో మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఓడించి సంచలనం సృష్టించిన అఫ్గాన్స్థాన్ జట్టు.. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఘోరంగా విఫలమై ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్.. కివీస్ బౌలర్ల ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read.. తెలంగాణను పుక్యానికి ఇవ్వలేదు.. ఇచ్చిపడేసిన కేసీఆర్
అఫ్గానిస్థాన్ జట్టులో రహమత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (27) మాత్రమే రాణించారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (11), ఇబ్రహీం జాద్రాన్ (14), హష్మతుల్లా షాహిది (8), ఇక్రమ్ (19) నిరాశ పరిచారు. ఆల్రౌండర్లు మహ్మద్ నబీ (7), రషీద్ఖాన్ (8) కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 3, మిచెల్ శాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Also Read.. ఆ నాలుగు నియోజకవర్గాలు నాలుగు మినీ భారతదేశాలు.. కేసీఆర్ సరికొత్త నిర్వచనం
అంతకుముందు న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్ (54) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్జాయ్ 2, నవీనుల్ హక్ 2, ముజిబుర్ రెహ్మన్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.