Sunday, May 12, 2024

రోడ్డుపై బైఠాయించిన నిజాం కాలేజీ స్టూడెంట్స్

spot_img

హైదరాబాద్: నిజాం కాలేజీ స్టూడెంట్స్ రోడ్డుపై బైఠాయించారు. గత వారం రోజులుగా హాస్టల్ లో సరిగ్గా ఫుడ్ పెట్టడం లేదంటూ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read.. ఏపీ అధికారితో శ్వేతపత్రం.. అసెంబ్లీలో కాంగ్రెస్ బండారం

వారం రోజులుగా బయట నుండే ఫుడ్ తెచ్చుకొని తింటున్నట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు బషీర్ బాగ్ చౌరస్తాలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Latest News

More Articles