Saturday, May 18, 2024

నో డౌట్.. ఇక రణమే..!

spot_img

ఈ ఏడాది చివ‌ర‌లో తెలంగ‌ణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌రుస‌గా మూడో సారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని భార‌త రాష్ట్ర స‌మితి అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు  వ్యూహాలు ర‌చిస్తున్నారు. దీనిలో భాగంగా ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్నారు. పార్టీ నాయ‌కులంద‌రూ కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం కొన‌సాగించాల‌ని సూచిస్తున్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవనీ, ప్రచారాన్ని ముమ్మరం చేయాలని.. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ లను నమ్మొద్దని అధినాయకత్వం అభ్యర్థులకు ఖచ్చితమైన సంకేతాలని ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఆగస్టు 21న 115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రమంతా కారు గాలి రెట్టింపు అయ్యిందని పలు సర్వేలు చెప్తున్నాయి.

Latest News

More Articles