Saturday, May 4, 2024

రాజయ్య, కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిర్చిన మంత్రి కేటీఆర్

spot_img

స్టేషన్‎ఘన్‎పూర్ లో ఆధిపత్య పోరులో ఉన్న ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య మంత్రి కేటీఆర్ సయోధ్యను కుదిర్చారు. వీరిద్దరూ ఈ రోజు ఉదయం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా ప్రగతి భవన్‎లో మంత్రి కేటీఆర్‎ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురితో మాట్లాడి పార్టీ గెలుపు కోసం భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సమన్వయంతో పని చేసి ఘనపూర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. రాజయ్య భవిష్యత్తుకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Read Also: మహిళా బిల్లుకు దూరంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

స్టేషన్‎ఘన్‎పూర్ టికెట్ దక్కించుకున్న కడియం శ్రీహరికి తన సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం పాటుపడతానని తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles