Friday, May 17, 2024

దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం ఎవరో తెలుసా..

spot_img

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన  సీఎంలలో ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 52.7 శాతం ఓట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానం ద‌క్కించుకున్నారు.

51.3 రేటింగ్ తో యోగి రెండో స్థానంలో నిలిచారు. కాగా, వివాదరహితుడిగా పేరున్న నవీన్ పట్నాయక్ ను ఈ సర్వేలో ప్రజలు బెస్ట్ సీఎంగా తేల్చారు. ఇక.. 48.6 శాతం ఓట్లతో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ నిలిచారు. ఈయ‌న‌కు 42.6 శాతం ఓట్లు దక్కాయి. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు ఈ సర్వేలో 41.4 శాతం ఓట్లు దక్కాయి. ప్రజాదరణలో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: బయ్యారంలో ఏటీఎం కొల్లగొట్టి రూ.29 లక్షలు చోరీ..!!

Latest News

More Articles