Friday, May 3, 2024

బయ్యారంలో ఏటీఎం కొల్లగొట్టి రూ.29 లక్షలు చోరీ..!!

spot_img

మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో దొంగలు హల్ చల్ చేశారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం అర్థరాత్రి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి 29లక్షల రూపాయల నగదును అపహరించినట్లు సమాచారం. ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినవారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. బ్లాక్ కారులో వచ్చిన 6గురు నిందితులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి ప్రయత్నించినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు.

మహబూబాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ తోపాటు ఆనవాళ్లను సేకరించారు. గత 6నెలల క్రితం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో కూడా దొంగలు చోరీకి యకి యత్నానికి పాల్పడ్డారని వారిని 24గంటల్లో పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: సూర్యపేటలో విషాదం..మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..!!

Latest News

More Articles