Sunday, May 19, 2024

289కి చేరిన ఒడిశా రైలు ప్రమాద మృతుల సంఖ్య

spot_img

ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 289కి చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కటక్‌లోని శ్రీరామచంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, ఈ నెల 2న ఒడిశాలోని బిలాస్‌పూర్‌ జిల్లాలోగల బహనగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నిలింగ్‌లో తప్పిదంతో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 288 మరణించిన విషయం తెలిసిందే.

Latest News

More Articles