Monday, May 6, 2024

బీజేపీలో ఈటలకు వ్యతిరేకంగా కొత్త గ్రూప్ ?

spot_img

తెలంగాణా బీజేపీ లో గ్రూపుల గోల పెరిగిపోతున్నట్లుంది. ఇప్పటికే పార్టీ చీఫ్ బండి సంజయ్ కు ఈటల రాజేందర్ కు ఏమాత్రం పడటంలేదు. బండికి వ్యతిరేకంగా జట్టుకడుతున్న నేతలు సమావేశమైనపుడు ఈటల వారి తో కలుస్తున్నారు. అంటే బండి గ్రూపు ఈటల గ్రూపు వేర్వేరుగా ఉందని అర్ధమవుతోంది. అలాంటిది ఈటల కు వ్యతిరేకంగా కొత్తగా ఒక గ్రూపు తయారైందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో పార్టీ లోని కొందరు సీనియర్లు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీలు విజయశాంతి రవీంద్రనాయక్ బూరనర్సయ్యగౌడ్ వివేక్ వెంకటస్వామి కొండా విశ్వేశ్వర రెడ్డి తో పాటు విఠల్ దేవయ్య కూడా పాల్గొన్నారు. సమావేశం తర్వాత జితేందర రెడ్డి మాట్లాడుతు బీజేపీ లో ఎన్నికల ప్రచార కమిటి ఛైర్మన్ అన్న పదవే లేదన్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఈటెలకు ప్రచార కమిటీ ఛైర్మెన్ పదవి రాబోతుందన్న వార్తల నేపథ్యంలో జితేందర్ రెడ్డి అండ్ గ్రూప్ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

Latest News

More Articles