చేర్యాల : కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర పర్యవేక్షణలో బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో మల్లికార్జునుడి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అయితే, మల్లన్న జాతరలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం వివాదాస్పదం అవుతోంది. దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ కోసం మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తుల వాహనాలను మూడు కిలోమీటర్ల ముందే ఆపేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తులను ఐదు గంటల పాటు రోడ్డుపైనే నిలబెట్టి దైవ దర్శనం చేసుకోకుండా అడ్డుకుని ప్రత్యక్ష నరకం చూపించారని ఆరోపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పుకుంటున్న అధికారులు.. ఇలా భక్తులను రాకను అడ్డుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కొండా సురేఖ కోసం భక్తులను 5 గంటలు ఆపేసిన అధికారులు
మంత్రి కొండా సురేఖ కోసం, కొమురవెల్లి మల్లన్న దర్శనంకి వచ్చిన భక్తుల వాహనాలను 3 కిలోమీటర్ల ముందే ఆపేసి, 5 గంటలు దర్శనం చేయనివ్వకుండా నరకం చూపించిన అధికారులు.
Video Source @4321Krr8281 pic.twitter.com/LcHYlkhX51
— Telugu Scribe (@TeluguScribe) January 8, 2024