Thursday, May 2, 2024

బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

spot_img

హైదరాబాద్:  కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ హత్యపై రాష్ట్ర డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మల్లయ్య యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

అనంతరం బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హత్య రాజకీయాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్షలు మంచిది కాదని, మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని, బీఆర్ఎస్ కార్యకర్త హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

Latest News

More Articles