మహబూబ్ నగర్ జిల్లా: ఈనెల 18న జడ్చర్లలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో జడ్చర్లలో నిర్వహించే మొదటి బహిరంగ సభ కానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేడు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి జడ్చర్లలో సీఎం సభాస్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
Also Read.. అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదు