తిరుమల: శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది. ఎట్టకేలకు ట్రాప్ కి గురైన నాలుగో చిరుత బోనులో చిక్కింది. వారం రోజులుగా చిరుతను ట్రాప్ చేసేందుకు అటవిశాఖ తీవ్రంగా కృషి చేసింది.
చిరుత బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్ననేపథ్యంలో వివిధ రకాల వ్యూహాలతో చిరుతను అటవిశాఖ అధికార్లు ట్రాప్ చేసేందుకు యత్నించి విజయం సాధించారు.
ఎట్టకేలకు నిన్న రాత్రి 7వ మైలు వద్ద చిరుత చిక్కింది. దినితో నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతలను అటవిశాఖ బంధించింది. ఇకపై భక్తులు ధైర్యంగా నడకమార్గంలో సంచరించి అవకాశం ఉందని టీటీడీ ప్రకటించింది.