Sunday, May 12, 2024

పాడి కౌశిక్ రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం..ఈటల ఓటమి ఖాయం!

spot_img

కరీంనగర్ జిల్లా: ఇల్లందకుంట మండలంలోని ఇల్లందకుంట, శ్రీరాములపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి. ప్రజలు నీరాజనాలతో అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సంధర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి నియోజక వర్గాన్ని అధ్బుతంగా తీర్చి దిద్దుతానని మాటిచ్చారు.

Also Read.. నాగర్ కర్నూల్ లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్!

ఇల్లందకుంట రాములవారి దేవాలయాన్ని మరో యాదద్రిగా తిర్చి దిద్దుతా అని చెప్పారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా ఐదు గంటలు చాలు అన్న కాంగ్రెస్ కావాలా, రైతు బంధు రుణమాఫీ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కావాలా? అని అడిగారు.  దళారి మాటలు చెప్పే బిజెపి కాంగ్రెస్ కావాలా ఆలోచించాలని కోరారు.

Also Read.. మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి 30 ఏళ్లు గుర్తుండేలా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పారు.

Latest News

More Articles