#PalamuruRangareddyProject : పాలమూరు గడ్డపై అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా అద్భుత ప్రాజెక్టుపై యావత్ దేశం దృష్టిపెట్టింది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు.
Also Read.. సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
సోషల్మీడియాలోనూ పాలమూరు ప్రాజెక్ట్ పై చర్చ నడుస్తోంది. దశాబ్దాల పాలనలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉత్తమాటలు చెప్పి కాలయాపన చేస్తే.. సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్లలోనే అనేక అద్భుతాలను ఆవిష్కరించారని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో #PalamuruRangareddyProject హ్యాష్ట్యాగ్ ట్విట్టర్ ( ఎక్స్)లో ట్రెండింగ్గా మారింది.
Also Read.. 70 ఏండ్ల కల సాకారం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. నార్లాపూర్ పంప్హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు.