పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న కేంద్రం 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దానికి ముందు రోజే జనవరి 31న ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరగనున్నాయి. తొలి విడతలో సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగుస్తాయి. బడ్జెట్ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. రెండో విడతలో వివిధ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించనున్నారు. ఐతే ఈ తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.