హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాల విషయంలో సీఎస్కే మేనేజ్మెంట్ అక్రమాలకు పాల్పడినట్లు చెన్నైకి చెందిన అశోక్ చక్రవర్తి లాయర్ చెన్నై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు.
MA చిదంబరం స్టేడియంలో తక్కువ ధర ఉండే లోయర్ స్టాండ్ టికెట్లను రూ.8వేలకు అమ్మినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు ఐపీఎల్ లీగ్ లో తన చివరి మ్యచ్ను ఢిల్లీతో చెన్నై ఆడనుంది. 15 పాయింట్లతో ఉన్న చెన్నై ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది.