ఏపీ చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జిల్లాలోని రొంపిచర్ల మండలం బోనంవారిపల్లిలో రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారు రెడ్డి శేఖర్, నరేష్ గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.