ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించానున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది సి.ఆర్ జయ సుకిన్. పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు పిటిషనర్.