Sunday, May 19, 2024

కాంగ్రెస్ తాటకు చప్పుల్లకు బయపడేది లేదు

spot_img

తాండూరు: కాంగ్రెస్ తాటకు చప్పట్లకు బయపడేది లేదని, ఎన్ని కుట్రలు పన్నినప్పటికిని ప్రజల మద్దతు తనకే ఉందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయ కుట్రతో పాటు తనపై కూడా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికుట్రలు చెసినా  అదిరేది లేదు బేజిరేదిలేదన్నారు. పట్టణంతో పాటు గ్రామాల్లో బిఆర్ఎస్ కు విశేష ఆదరణ ఉందన్నారు.

కాంగ్రెస్ నేతలు ప్రజలను మబ్బపెట్టి మాయమాటలు చేప్పి మోసం చేస్తూన్నారు. దొంగలు దొంగలు ఓక్కటై లేని పోని కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల్లో తాండూరు నియోజకవ ర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం ఖాయమని అన్నారు. జతకట్టి జయకేతనం ఎగురవేద్దామన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు ప్రజలను బయబ్రాతులకు గురిచేస్తూన్నారని తెలిపారు. లేనిపోనిఆరోపనలు చేస్తే సహించబోమన్నారు. బిఆర్ఎస్ ప్రావేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకేల్లాలని కోరారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

Latest News

More Articles