Sunday, May 19, 2024

జైస్వాల్ వీరంగం.. 25 బంతుల్లో 53 పరుగులు

spot_img

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్‌, ఆరోన్‌ హార్డీ స్థానాల్లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా ఆసీస్‌ జట్టులోకి వచ్చారు.

Read Also: ఎల్లుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ

తొలి టీ20లో బంతిని ఎదుర్కోకుండానే డైమండ్‌ రనౌట్‌గా వెనుదిరిగిన రుతురాజ్‌ ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ 25 బంతుల్లో 53 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్స్ లు) చేసి చక్కటి ఆరంభాన్నిచ్చాడు. న్యాథన్ ఎల్లీస్ బౌలింగ్‎లో ఆడమ్ జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ కోల్పోయి 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది.

Latest News

More Articles