నిజామబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న ఆయన బాన్సువాడ నుంచి గెలుపొంది గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేసి చరిత్ర సృష్టించారు.
గతంలో స్పీకర్గా పనిచేసిన వారు.. తదుపరి ఎన్నికల్లో గెలుపొందిన సందర్భాలు లేవు. గతంలో స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాదెండ్ల మనోహర్, కిరణ్కుమార్రెడ్డి, సురేష్రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు ఓటమి చవిచూశారు.