హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా.. ఈసారి వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైనవారు ఉన్నారు. కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, మామిడాల యశస్విని(పాలకుర్తి), పర్నికా రెడ్డి(నారాయణ్పేట్) ఉన్నారు. వీరితోపాటు ఆసిఫాబాద్లో కోవా లక్ష్మి, నర్సాపూర్లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.